Friday, March 29, 2024

‘‘భార్యాభర్తల” ప్రైవసీ మనకెందుకు?: ఖుష్బూ

ప్రస్థుతం సోషల్ మీడియాలో నాగచైతన్య–సమంతల విడాకుల గురించే చర్చ నడుస్తోంది. కొన్ని నెలలుగా వీరిద్దరూ విడిపోబోతున్నారని వార్తలు వస్తున్న ఏ ఒక్కరూ పెదవి విప్పలేదు. ఎట్టకేలకు శనివారం మధ్యాహ్నాం ఈ జంట తమ విడాకుల విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి. చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నామని చె–సామ్‌ తెలిపారు. అయితే వీరిద్దరి విడాకుల వ్యవహారాన్ని అభిమానులే కాదు నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా సమంత తమ విడాకుల ప్రకటన తర్వాత తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. ‘‘ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు నన్ను నేను మార్చుకోవాలి. నా పడకగదిని నేను సిద్థం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నాం వరకూ నిద్రపోకూడదు. ఇక, పగటి కలలు కనడం మాని చేయాల్సిన పనుల పైనే దృష్టి పెట్టాలి’ అని ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశారు సామ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది.

సమంత విడాకుల పట్ల సీనియర్‌ నటి ఖుష్బూ స్పందించారు. ‘‘భార్యభర్తల మధ్య ఏం జరిగింది అనేది, ఎందుకు విడిపోయారనేది వారిద్దరికీ తప్ప ఎవరికీ తెలీదు. వాళ్ల ప్రైవసీని అందరూ గౌరవించాలి. ఆ బాధ నుంచి వారు బయటకు రావడానికి కాస్త సమయం పడుతుంది. దయ చేసి ఈ విషయంపై రూమర్లు క్రియేట్‌ చేయవద్దు’’ అని ఖుష్బూ కోరారు. 

ఇది కూడా చదవండి: ఉడుతల కష్టార్జితం..

Advertisement

తాజా వార్తలు

Advertisement