Tuesday, March 26, 2024

టీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా: కేటీఆర్

టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, కుటుంబాలకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి కేటీఆర్‌ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్సింహులపల్లికి చెందిన టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు బొంగురపు శ్రీనివాస్‌రెడ్డి.. కొద్ది రోజుల కిందట కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందాడు. సోమవారం బాధిత కుటుంబాన్ని కేటీఆర్‌ పరామర్శించారు. శ్రీనివాస్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. తక్షణ సహాయంగా రూ.2లక్షల చెక్కును అందజేశారు. శ్రీనివాస్‌ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అన్ని వేళల కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. గ్రామానికి వచ్చిన మంత్రికి స్థానికులు పెద్ద ఎత్తున వినతిపత్రాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement