Thursday, March 28, 2024

ఆరున్నరేళ్లలో ఆణాపైసా రాలేదు: కేటీఆర్

కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరున్న‌రేళ్లలో తెలంగాణ‌కు కేంద్రం అణా పైసా కూడా స‌హాయం చేయ‌లేదన్నారు.  కేంద్రం తెలంగాణ‌కు చేసింది గుండు సున్నా అని ధ్వ‌జ‌మెత్తారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. విభజన చట్టంలో తెలంగాణ, ఏపీకి పారిశ్రామిక రాయితీలు కేంద్రం ఇస్తానని చెప్పి,  ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం  ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా ఎవరికి కూడా రూపాయి ప్రయోజనం కలగలేదని చెప్పారు. కేంద్రం ప్యాకేజీతో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం లేదని, కేంద్రం ద్వారా తెలంగాణకు వచ్చిందేమీ లేదన్నారు.  ఇప్ప‌టికైనా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక రాయితీల‌ను ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం కోరుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement