Friday, March 29, 2024

అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు..

సీనియర్‌ నటుడు రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు కన్నుమూశారు. గతకొంతకాలం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఆదేశించారు. దీంతో కృష్ణంరాజు అంత్యక్రియలకు సీఎస్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement