Thursday, March 28, 2024

చిక్కుల్లో ‘రిపబ్లిక్’ సినిమా

దేవ్ కట్టా దర్శకత్వంలో వచ్చిన ‘రిపబ్లిక్’ మూవీ అక్టోబరు 1న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విజయవంతంగా రన్ అవుతోంది. సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించగా.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారు.

అయితే ఈ రిపబ్లిక్ సినిమాపై ప.గో జిల్లా కొల్లేరు గ్రామాల వాసూలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సినిమాలో చెరువులను, చేపలను విషతుల్యం చేస్తున్నామని మా గ్రామాలపై దుష్ప్రచారం చేశారు. కొల్లేరు వాసుల మనోభావాలు దెబ్బతిసే విధంగా దర్శకుడు దేవా కట్టా చిత్రీకరణ చేశాడు. రిపబ్లిక్ సినిమాను నిలిపివేయాలి’ అంటూ కొల్లేరు వాసులు డిమాండ్ చేశారు. రిపబ్లిక్ సినిమా ఆపివేయలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు కొల్లేరు గ్రామాల వాసులు వినతి పత్రం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement