Wednesday, April 24, 2024

విరాట్ కోహ్లీ టాప్ ర్యాంకు హుష్ కాకి

వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ నెంబర్ వన్ ర్యాంకింగ్ కోల్పోయాడు. చాలా రోజులుగా వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నంబర్‌వన్‌‌ ర్యాంకును కోల్పోయాడు. కోహ్లీ స్థానంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ నెంబర్ వన్ ప్లేసును దక్కించుకున్నాడు. టాప్‌ ర్యాంక్‌ సాధించిన నాలుగో పాకిస్థాన్‌ ఆటగాడిగా బాబర్‌ అరుదైన ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(865 రేటింగ్‌ పాయింట్లు).. కోహ్లీ(857పాయింట్లు)ని రెండో స్థానానికి నెట్టి నెంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచాడు. కోహ్లీ కన్నా అజామ్ 8 పాయింట్లు ముందున్నాడని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. టీమ్‌ఇండియా త్వరలో వన్డే మ్యాచ్‌ల్లో ఆడేది లేకపోవడంతో బాబర్‌ చాలా రోజుల పాటు నంబర్‌వన్‌గా ఉండే అవకాశం ఉంది. భారత్‌ నుంచి ర్యాంకింగ్స్‌లో హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement