Wednesday, April 24, 2024

కోహ్లీ-అనుష్క ప్రేమాభిషేకం.. రొమాంటిక్ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన విరాట్‌

ముంబై: యంగ్ అండ్ డైన‌మింక్ క్రికెట‌ర్‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ-20 ప్ర‌పంచ క‌ప్ త‌ర్వాత క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. కుటుంబంతో విహార యాత్ర‌కెళ్లాడు. యాత్ర నుంచి తిరిగొచ్చిన త‌ర్వాత న్యూజిలాండ్‌తో డిసెంబ‌ర్ 3 నుంచి ముంబై వేదిక‌గా జ‌రిగే రెండో టెస్టు కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. విశ్రాంతి స‌మ‌యంలో త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి ప్ర‌ధానంగా విహార యాత్రలో భార్య అనుష్క‌తో ఓ న‌ది ప‌క్క‌న కూర్చొని సేద‌తీరుతున్న ఫొటోను అభిమానుల కోస‌మంటూ కోహ్లీ త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు.

దానికి ’నువ్వు ప‌క్క‌నుంటే ఎక్క‌డున్నా అది ఇల్లే ‘ అని క్యాప్ష‌న్ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. కోహ్లీ అభిమానులు తెగ సంబ‌ర‌ప‌డి పోతున్నారు. లైకులు మీదు లైకులు కొడుతూ శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఈ ఫొటోకు ఇప్ప‌టికే సుమారు 30ల‌క్ష‌ల మందికి పైగా లైక్ కొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement