Thursday, March 28, 2024

ఈటెలపై జరిగిన దాడి ఆత్మ గౌరవ దాడిగా పరిగణిస్తాం: కోదండరాం

ఈటెల రాజేందర్ పైన జరిగిన దాడిని ఆత్మ గౌవర దాడిగా పరిగణిస్తామన్నారు కోదండరాం. ఈటెల విషయంలో ఐక్య వేదికగా నిర్మాణం అవ్వాలనే ఆలోచనలో సమావేశం అయ్యామన్నారు. కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐక్య వేదిక నిర్మాణం అనేది ఏ రూపకంగా జరిగుతుందో చూడాలన్నారు. ఈటెల కుటుంభం పై కేసీఆర్ రాజకీయ కక్షలకు దిగుతున్నారని కొండ విష్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఒకవేళ ఈటెల రాజేందర్ నిజంగా తప్పు చేసి ఉంటే పార్టీ నుండి ఎందుకు సాస్పెండ్ చేయడం లేదన్నారు. లేదా అనర్హుడిగా ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఇవేవీ చేయడానికి కేసీఆర్ ధైర్యం లేదా?- ఈటెల విషయంలో తామంతా ఆయనకు మద్దతుగా నిలుస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement