Friday, March 29, 2024

Delhi | తెలంగాణ రోడ్డు ప్రాజెక్టులను వేగవంతం చేయండి.. గడ్కరీని కోరిన కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో రోడ్డు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కోరారు. జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై చర్చించేందుకు బుధవారం ఆయనతో సమావేశమయ్యారు. తెలంగాణలో ఇప్పటికే అమల్లో ఉన్న వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులతోపాటు ప్రతిష్టాత్మకమైన రీజనల్ రింగ్ రోడ్ (ఆర్.ఆర్.ఆర్) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కోరారు. దీంతోపాటుగా రాష్ట్రానికి సంబంధించిన ఇతర జాతీయ రహదారుల ప్రాజెక్టుల గురించి కూడా చర్చించారు. కిషన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ప్రాజెక్టుల పురోగతిపై అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీచేశారని కిషన్ రెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement