Thursday, April 25, 2024

కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ధోనీపై కోహ్లీ ప్రశంసలు

క్రికెట్‌లోని అత్యుత్త‌మ ఫినిష‌ర్ల‌లో ఒక‌డిగా పేరుగాంచిన మ‌హేంద్ర సింగ్ ధోనీ చాలా రోజుల త‌ర్వాత మెరుపులు మెరిపించాడు. ఢిల్లీతో జరిగిన క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌లో చివ‌ర్లో వ‌చ్చి చెల‌రేగిన ధోనీ.. చెన్నైని చివ‌రి ఓవ‌ర్లో గెలిపించాడు. చేసింది 18 ప‌రుగులే అయినా.. ఆ స‌మ‌యంలో ఉండే ఒత్తిడిని త‌ట్టుకుంటూ ఒక‌ప్ప‌టి ధోనీని త‌ల‌పించాడు. ఈ ఇన్నింగ్స్ చూసిన టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాచ్ త‌ర్వాత‌ మిస్ట‌ర్ కూల్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ఓ ట్వీట్ చేశాడు. కింగ్ ఈజ్ బ్యాక్‌.. గేమ్‌లో గ్రేటెస్ట్ ఫినిష‌ర్‌. మ‌రోసారి న‌న్ను ఆనందంతో గెంతులేసేలా చేశాడు అని ధోనీని ట్యాగ్ చేస్తూ విరాట్ ట్వీట్ చేశాడు.

అటు పంజాబ్ కింగ్స్ ఓన‌ర్ ప్రీతి జింటా కూడా ధోనీని పొగుడుతూ ఓ ట్వీట్ చేసింది. ఫినిష‌ర్ ధోనీ మ‌రోసారి ముందుండి టీమ్‌ను న‌డిపించాడు. త‌న ఆటగాళ్లకు స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తూ, ఎప్పుడూ త‌న స‌హనాన్ని కోల్పోకుండా ఉన్నాడ‌ని ప్రీతి ఆ ట్వీట్‌లో ప్ర‌శంసించింది. 173 పరుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన సీఎస్కే.. రుతురాజ్ గైక్వాడ్‌, రాబిన్ ఉత‌ప్ప క‌ళ్లు చెదిరే ఇన్నింగ్స్‌, ధోనీ ఫినిషింగ్‌తో క్వాలిఫ‌య‌ర్‌లో గెలిచి 9వ సారి ఐపీఎల్‌ ఫైన‌ల్లో అడుగుపెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement