Thursday, April 25, 2024

కియా నుంచి త్వ‌ర‌లో మ‌రో ఈవీ కారును రిలీజ్.. స్టార్ట్ అయిన ఆన్‌లైన్ బుకింగ్స్..

త‌క్కువ‌ కాలంలోనే భార‌తీయ‌ కార్ల మార్కెట్‌లో నిలిచి మంచి క్రేజ్ క్రిమేట్ సంపాదించుకున్న‌ కియా నుంచి త్వరలో మ‌రో ఎలక్ట్రిక్‌ కారును తీసుకురాబోతుంది. ఈవీ 6 పేరుతో ఈ మోడల్‌ను రిలీజ్‌ చేయనుంది. సింగిల్‌ ఛార్జ్‌తో 528 కిలోమీటర్లు ప్రయాణం చేయోచ్చని కియా చెబుతోంది. ఈ కారులో 77.4 కిలోవాట్‌ బ్యాటరీని అమర్చారు. 5.2 సెకన్లలో వంద కిలోమీటర్ల స్పీడును అందుకోగలదు. 18 నిమిషాల్లో బ్యాటరీ 80 శాతం ఛార్జ్‌ అవుతుంది. అయితే వచ్చే నెట (జూన్‌) 2వ తేదిన ఈ కారును మార్కెట్‌లో రిలీజ్‌ చేయబోతుంది కియా. కాగా.. ఆన్‌లైన్‌లో ఆడ్వాన్స్‌ బుకింగ్స్ స్టార్ట్ చేసింది కియా. టోకెన్‌ అమౌంట్‌గా మూడు లక్షల రూపాయలను అడ్వాన్స్‌ బుకింగ్‌ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement