Thursday, April 25, 2024

ఖమ్మం సభ దేశంలో రాబోయే మార్పునకు సంకేతం.. కేసీఆర్

ఖమ్మం సభ దేశంలో రాబోయే మార్పునకు సంకేతమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… 589 గ్రామ పంచాయితీలకు రూ.10లక్షల చొప్పున కేటాయిస్తున్నామన్నారు. మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇతర మున్సిపాలిటీకి రూ.30కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ఖమ్మంకు గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ జాతీయ పాలసీ, వైఖరి సమగ్రంగా వెల్లడిస్తామన్నారు. లక్షల కోట్ల ఆస్తి మన దేశం సొత్తు అని కేసీఆర్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement