Tuesday, April 16, 2024

బెడ్ షీట్ తో ఉరేసుకుని చెర్లపల్లిలో ఖైదీ ఆత్మహత్య..

హైదరాబాద్ శివారులోని చర్లపల్లి జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. బానోత్ శ్రీనివాస్ నాయక్ అనే ఖైదీ గత రెండు రోజులుగా జైలు ఆస్పత్రిలో అగారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు.. అయితే అస్పత్రిలోని బెడ్ షీట్ తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని గుర్తించిన హాస్పిటల్‌ సిబ్బంది జైలు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 2019లో సూర్యాపేటలో జరిగిన హత్య కేసులో శ్రీనివాస్‌ నిందితుడు. దీంతో శ్రీనివాస్ నాయక్ కు జీవిత ఖైదు శిక్ష పడింది.. అయితే ఈ క్రమంలో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైదీ ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ‘ఆదిత్య 369’ చిత్రానికి 30 ఏళ్లు.. స్పెషల్ వీడియో విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement