Tuesday, April 16, 2024

‘ప్రాజెక్ట్​ కె’లో అమితాబ్‌, దీపికా కీలక సన్నివేశాలు.. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్..

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కొత్త సినిమాలపై అప్‌డేట్స్‌ వస్తున్నాయి. ఆయన తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’ మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. కాగా, ఆ సినిమా నుంచి తాజాగా ఒక అప్ డేట్ కూడా ఇచ్చారు. ఇది ప్రేమకథా చిత్రం కావడంతో ప్రేక్ష‌కులలో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ‘ఆదిపురుష్‌’ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. సలార్‌ కోసం రెండు ప్రధాన షెడ్యూల్స్‌ జరిగాయి. ఇకపోతే మహానటి ఫేమ్‌ నాగఅశ్వన్‌ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్‌ రెండు సార్లు వాయిదా పడి ఇటీవలే మొదలైంది. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తిచేసినట్టు సమాచారం. తదుపరి షెడ్యూల్‌ ప్రధానమైనది. ప్రభాస్‌తో పాటుగా అమితాబ్‌, దీపికా పదుకునె పాల్గొంటారని తెలుస్తుంది. వీరితో కొన్ని కీలక సన్నివేశాలు తీస్తారట‌. ఈ షెడ్యూల్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగనుంది. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. 400 కోట్ల బడ్జెట్‌ ఈ సినిమా కోసంవెచ్చిస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement