Thursday, April 25, 2024

అగ్నిప్ర‌మాద బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన కేజ్రీవాల్

ఢిల్లీలోని గోకుల్పురిలోని మురికివాడలో ఈరోజు భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 60 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమాద బాధితులను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. గోకుల్పురి ప్రాతానికి వెళ్లిన ఆయన.. ప్రమాదంలో సర్వం కోల్పోయిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. గూడు కోల్పోయిన వారికి రూ.25,000లు, మంటల్లో చిక్కుకుని చనిపోయిన పెద్దల కుటుంబాలకు రూ.10 లక్షలు, చిన్నారుల ఫ్యామిలీలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement