Friday, March 29, 2024

గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమెను కలిశారు. మరోవైపు ఈరోజు తమిళిసై పుట్టినరోజు కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందించి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై ఇద్దరూ చర్చించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా గవర్నర్ కు సీఎం వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement