Thursday, April 25, 2024

మమతా బెనర్జీ గెలిచింది- మోడీ రాజీనామా చేస్తారా..? : ఎమ్మెల్సీ కవిత..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ కి చురకలు కౌంటర్‌ ఇచ్చారు. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ విజయం ఖాయమని… ప్రతి ఎన్నికకు సవాల్ చేయడం కరెక్ట్ కాదని ఫైర్‌ అయ్యారు. హుజురాబాద్‌ నియోజక వర్గంలో గెల్లు శ్రీనివాస్‌ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. నిన్న మమతా బెనర్జీ గెలిచింది- మోడీ రాజీనామా చేస్తారా? మమతా బెనర్జీ ఎన్నిక బీజేపీ ఛాలెంజ్ గా తీసుకుంది కదా? అని ఎద్దేవా చేశారు.

బండి సంజయ్ ఇష్టంవచ్చినట్లు మీడియాలో కనిపించేందుకు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళ్తారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవ్వరూ గెలువలేదని గుర్తు చేశారు కవిత. కాగా… నిన్న హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో భాగంగా.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్.. ఆ నియోజక వర్గంలో ప్రచారం ప్రారంభం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. అంతేకాదు.. హుజురాబాద్‌ నియోజక వర్గంలో.. టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోతే… కేసీఆర్‌ తన ముఖ్యమత్రి పదవికి రాజీనామా చేస్తారా ? అని సవాల్‌ విసిరారు. అయితే… బండి సంజయ్‌ చేసిన.. సవాల్‌ కు ఇవాళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్‌ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: మళ్లీ పెరిగిన పుత్తడి ధరలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement