Thursday, April 25, 2024

కత్తి మహేష్ మృతిపై అనుమానాలు: తండ్రి ఓబులేషు

సినీ విమర్శకుడు కత్తి మహేష్ మృతిపై దుమారం చెలరేగుతోంది. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి ఆస్పత్రిలో చికిత్స వరకు పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కత్తి మహేష్ మృతిపై న్యాయ విచారణ చేయాలని తాజాగా ఆయన తండ్రి ఓబులేషు డిమాండ్ చేశారు. కత్తి మహేష్ మరణించిన విషయం తమకు చెప్పకుండానే బయటకు వెల్లడించారని ఆరోపించారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని కత్తి మహేష్ తండ్రి ఓబులేషు పేర్కొన్నారు. ఇప్పుడు న్యాయం కోసం పోరాడే పరిస్థితిలో లేనన్నారు. కానీ తన కుమారుడి మృతిపై మాత్రం అనుమానాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

కాగా ఇటీవల కత్తి మహేష్ మృతిపై మందకృష్ణ మాదిగ కూడా అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో కారు కుడిభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినా డ్రైవర్ సురేష్ స్వల్పగాయాలతోనే బయటపడ్డాడని.. కానీ ఎడమ వైపు కూర్చొన్న కత్తి మహేష్ తీవ్రంగా గాయపడడం అనుమానాస్పదంగా ఉందని మందకృష్ణ ఆరోపించారు. మహేష్‌కు చాలా మంది శత్రువులు ఉన్నారని, అందుకు అతడి మృతిపై విచారణ చేయాలని సీఎం జగన్‌ను మందకృష్ణ కోరారు. దీంతో ఈ కేసుపై ఏపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగినప్పుడు కారును డ్రైవింగ్ చేసిన సురేష్‌ను విచారించారు. బుధవారం మరోసారి విచారించనున్నారు.

ఈ వార్త కూడా చదవండి: మరో రెండు నెలలు అలిపిరి మెట్ల మార్గం క్లోజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement