Saturday, April 20, 2024

ఈ నెల 30నుండి – జీ5లో కార్తికేయ‌2

ఈ నెల 30నుండి జీ5లో కార్తికేయ‌2 చిత్రం స్ట్రీమింగ్ కానుంది.యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ, యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలను క్రియేట్ చేసిన ఈ మైథాలజికల్ ఫిల్మ్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. తెలుగు స్టేట్స్ తో పాటు ఇతర సెంటర్లలోనూ ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ జరిగింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్‌ను లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5 సంస్థ.. కార్తికేయ2 డిజిటల్ రైట్స్‌ ను సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఈ సినిమా ఈ నెల 30 వ తేదీన ఓటీటీలో రిలీజ్‌ కానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే.. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement