Friday, April 26, 2024

సీఐ మ‌హేశ్వ‌ర‌రెడ్డిపై వేటు

రూ.40వేలు లంచం తీసుకుంటూ ఏఎస్ ఐ ఖాద‌ర్ వ‌లి ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డాడు. కర్నూలు జిల్లా వెల్దుర్తి సీఐ మహేశ్వరరెడ్డిపై పోలీసు అధికారులు వేటు వేశారు. రెండు రోజుల క్రితం సీఐ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏఎస్‌ఐ ఖాదర్‌వలి పట్టుబడ్డాడు. ఈ కేసులో సీఐ నేరుగా కాకుండా ఏఎస్సై ద్వారా లంచం తీసుకున్నారని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారించిన అధికారులు అతడిపై సస్పెన్షన్‌ చర్యలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement