Thursday, March 28, 2024

ఆ జిల్లాలో కరోనా కేసులు నిల్‌..

 దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మందగించినప్పటికి ఇంకా కొన్ని చోట్ల మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా 1240 మందికి పాజిటివ్‌ సోకగా బెంగళూరులో 319, దక్షిణ కన్నడ 264, ఉడిపి 111 మంది అత్యధికం నమోదయ్యారు. 1252 మంది కోలుకోగా 22 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రెం డు వారాలుగా 1400 లోపుగానే కొనసాగుతున్నాయి. రెండో విడత వైరస్‌ సోకిన తర్వాత తొలిసారిగా బీదర్‌ జిల్లాలో యాక్టివ్‌ కేసులు నిల్‌ అయ్యాయి. గడచిన వా రం రోజులుగా ఇద్దరు బాధితులు ఉండేవారు. వారిలో ఒకరు మృతి చెందగా మరొకరు కోలుకున్నారు. దీంతో జిల్లాలో పూర్తిగా కొవిడ్‌ కేసులు లేనట్టయింది. రాయచూరులో నలుగురు మాత్రమే బాధితులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Star gazing: లార్డ్స్ నుంచి ప్రేరణ పొందండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement