Thursday, April 25, 2024

Karnataka – ఘోర రోడ్డు ప్ర‌మాదం – ఆరుగురు దుర్మ‌ర‌ణం

గంగావతి, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లా కుష్ఠగి తాలూకా జాతీయ రహదారి 50పై కలికేరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. విజయపురకు చెందిన కుటుంబసభ్యులు ఆరుగురు కారులో బెంగళూరు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న రాచప్ప బనసోడె, రాఘవేంద్ర కాంబళె, అక్షయ శివశరణ, జయశ్రీ కాంబళె, చిన్నారులు రాఖీ, రష్మిక అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు క్రేన్‌ సాయంతో కారును బయటకు లాగి మృతదేహాలను వెలికి తీశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement