Wednesday, April 17, 2024

కరీంనగర్ అడ్డా.. బీజేపీ గడ్డా.. బండి సంజయ్

కరీంనగర్ అడ్డా.. బీజేపీ గడ్డా అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తానన్నారు. ధర్మం కోసం యుద్ధం చేస్తానన్నారు. తనకు డిపాజిట్ రాదని హేళన చేశారని, కరీంనగర్ నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచానన్నారు. రాక్షస పాలన, కుటుంబ పాలన అంతమొందిస్తామన్నారు. కమలం జెండా వికసించేలా పనిచేయాలని మోడీ చెప్పారన్నారు. కరీంనగర్ గడ్డ మీద గాండ్రిస్తే కొందరికి వణుకు పుట్టాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement