Thursday, April 25, 2024

కాణిపాకం వ‌ర‌సిద్ధి వినాయ‌క ఆల‌యానికి – గోమాత‌ని బ‌హుక‌రించిన ఎమ్మెల్యే ‘రోజా’

చిత్తూరు జిల్లాలోని సుప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం కాణిపాకం వ‌ర‌సిద్ధి వినాయ‌క ఆల‌యాన్ని సంద‌ర్శించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి ఓ గోమాతను కూడా బహుకరించారు. అనంతరం ఆలయానికి వెనుకభాగంలో ఉన్న నక్షత్ర వనంలో తన జన్మనక్షత్రం పేరు మీద ఉన్న వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు రోజా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె పంచుకున్నారు. కాగా, ఆలయ మర్యాదలను అనుసరించి రోజాకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement