Thursday, April 25, 2024

కాక‌తీయ స‌ప్తాహం గొప్ప‌గా ప్రారంభ‌మైంది : మంత్రి కేటీఆర్ ట్వీట్

రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్క‌ర్‌పై రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ల మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా అభినందించారు. కాక‌తీయ స‌ప్తాహంను గొప్ప‌గా ప్రారంభించినందుకు వారిని కేటీఆర్ అభినందించారు. వారం రోజుల పాటు జ‌రిగే కాక‌తీయ స‌ప్తాహం వేడుక‌లు కాక‌తీయ రాజుల సేవ‌ల‌ను గుర్తు చేస్తున్నాయ‌న్నారు. అదే విధంగా మ‌న సంస్కృతిని, వార‌స‌త్వాన్ని ఈ వేడుక‌లు గుర్తు చేస్తున్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement