Wednesday, April 17, 2024

నారా లోకేష్‌ను కలిసిన వైసీపీ నేత

కడప జిల్లా: రాయచోటి మాజీ ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి తనయుడు ప్రస్తుత వైసీపీ నేత, మాజీ పీసీసీ సభ్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం నాడు హైదరాబాద్‌లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని నారా లోకేష్ నివాసానికి వెళ్లి లోకేష్ రాంప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. త్వరలో రాంప్రసాద్ రెడ్డి అధికార పార్టీ వైసీపీని వీడి టీడీపీలో చేరనున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంచరించుకుంది. రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతంపై రాంప్రసాద్ రెడ్డితో లోకేష్ చర్చించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement