Thursday, April 18, 2024

జడ్జి హత్య కేసు..సుమోటో విచారణకు సుప్రీం స్వీకరణ..

జార్ఖండ్‌లో సంచలనం సృష్టించిన ధన్ బాద్ జిల్లా అదనపు జడ్జి హత్య కేసును సుప్రీం కోర్టు సమోటో గా స్వీకరించింది. జ‌డ్జి ఉత్త‌మ్ ఆనంద్ హ‌త్య‌కు సంబంధించిన పూర్తి విచార‌ణ‌ వివ‌రాల‌ను కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని జార్ఖండ్ చీఫ్ సెక్ర‌ట‌రీని ధ‌ర్మాస‌నం ఆదేశించింది. డీజీపీ కూడా ఆ హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఇవ్వాల‌ని కోర్టు కోరింది. దర్యాప్తును ఝార్ఖండ్ హైకోర్టు పర్యవేక్షిస్తుందని నిన్న సుప్రీంకోర్టు తెలిపింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా కేసును విచారణకు తీసుకుంది.

ఓ జిల్లా జడ్జిని ఆటో రిక్షాతో ఢీకొట్టి హత్య చేయడం దురదృష్టకరమని జస్టిస్ రమణ అన్నారు. మీడియా, సోషల్ మీడియాలో ఆ వార్తను సరైన రీతిలో ప్రచురించారని, ఝార్ఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కేసును పరిగణనలోకి తీసుకున్నారని చెప్పారు. కాగా, బుధవారం ఉదయం జడ్జి ఉత్తమ్ ఆనంద్ జాగింగ్ చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన దుండగులు ఆటోతో ఢీకొట్టి, హత్య చేసి పరారైన సంగతి తెలిసిందే. సీసీటీవీ ఫుటేజీతో విషయం వెలుగులోకి రావడంతో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తమ్ ఆనంద్ కు చాలా స్ట్రిక్ట్ జడ్జిగా పేరుంది. ఇటీవల కొందరు గ్యాంగ్ స్టర్లకు ఆయన బెయిల్ ను తిరస్కరించారు. ఆ కక్ష కొద్దీ ఆయన్ను హత్య చేసినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి : శిల్పాశెట్టిలకు, రాజ్ కుంద్రా దంపతులకు రూ.3 లక్షల జరిమానా..

Advertisement

తాజా వార్తలు

Advertisement