Tuesday, March 26, 2024

ఆస్పత్రిలో ఎన్టీఆర్ అభిమాని.. సాయంగా రూ.2.5 లక్షలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు. అభిమానులకు ఏ కష్టం వచ్చినా.. నేనున్నా అంటూ ముందుకు వస్తారు. ఈ క్రమంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయడిన ఎన్టీఆర్ అభిమానికి సాయం అందించారు. ఇటీవ‌ల తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లికి చెందిన మురళి అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆస్పత్రికి వెళ్లి.. మురళిని పరామర్శించారు. అనంతరం ఎన్టీఆర్ కు ఫోన్‌ చేసి మురళితో మాట్లాడించారు. ఈ సందర్భంగా మురళికి ఎన్టీఆర్‌ ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మురళీ ఆరోగ్య ఖర్చులకు గానూ ఎన్టీఆర్‌ అభిమానులు ఆయనకు రూ.2.5లక్షలు అందించారు.

ఇది కూడా చదవండి: Big boss 5: ఈ వారం నామినేషన్ లో ఉన్నది వీరే..

Advertisement

తాజా వార్తలు

Advertisement