Thursday, April 25, 2024

సాయి తేజ్ ప్రమాదంపై jr.NTR ఎమన్నారంటే..

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న నటుడు సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ఆయన అభిమానులు, సన్నిహితులు, ప్రముఖులు కోరుకుంటున్నారు. సాయి ప్రమాదంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సోదరుడు సాయి ధరమ్ తేజ్ తర్వాగా కోలుకోవాలని అకాంక్షించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సాయితేజ్ సత్వరమే కోలుకోవాలని, ఆరోగ్యవంతుడవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. “సాయితేజ్… నువ్వు మునుపటి ఉత్సాహం, తరగని శక్తితో తిరిగి రావాలని మేమందరం ప్రార్థిస్తున్నాం” అని ట్వీట్ చేశారు.

టీమిండియా క్రికెటర్ హనుమ విహారి కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. అసలు, సాయితేజ్ యాక్సిడెంట్ ఫుటేజి చూస్తుంటే భయానకంగా ఉందని అన్నారు. అదృష్టం కొద్దీ సాయితేజ్ కు ప్రమాదమేమీలేదని తెలిపారు. బ్రదర్… నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం అని పేర్కొన్నారు.


Advertisement

తాజా వార్తలు

Advertisement