Tuesday, April 16, 2024

జోడో యాత్ర‌లో జోష్.. సైక్లిస్ట్‌గా మారిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర విజ‌య‌వంతంగా సాగుతోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మో ప్రాంతంలో సోమ‌వారం జోడో యాత్ర కొన‌సాగుతుండ‌గా.. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీ సైక్లిస్ట్‌గా మారారు. కొంత దూరం సైకిల్ న‌డుపుతూ కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపారు. ఇదిలా ఉంటే నిన్న రాయ‌ల్ ఎన్ఫీల్డ్ బైక్ న‌డిపి ఉత్సాహం నింపారు. మొత్తం మీద భార‌త్ జోడో యాత్ర ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ రాహుల్ యాత్ర ఏడు రాష్ట్రాల్లోని 34 జిల్లాల మీదుగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చేరుకుంది. మోదీ స‌ర్కార్ విధానాల‌ను ఎండ‌గ‌డుతూ, కేంద్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపుతూ రాహుల్ భార‌త్ జోడో యాత్ర సాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement