Friday, March 29, 2024

జియో ఫైబర్‌ బంపరాఫర్‌.. పోస్ట్‌ పెయిడ్‌ వారికే ఛాన్స్‌

న్యూఢిల్లి : జియో ఫైబర్‌ తన పోస్టు పెయిడ్‌ కొత్త చందాదారులకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఎంట్రీ ఫీజుతో పాటు ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ విభాగంలో కొత్త పథకాలను తీసుకొచ్చింది. కొత్తగా జియో ఫైబర్‌ పోస్ట్ పెయిడ్‌ సేవలు ఎంపిక చేసుకునే వారికి రూ.10వేలు విలువ చేసే ఇంటర్నెట్‌ బాక్స్‌, సెట్ టాప్‌ బాక్స్‌, వీటి ఇన్‌స్టాలేషన్‌ను ఉచితంగా ఇస్తున్నట్టు జియో ఫైబర్‌ ప్రకటించింది. సబ్‌ స్రైబర్లకు నెలకు రూ.399, రూ.699 ప్రత్యేక ఇంటర్నెట్‌ ఆఫర్‌లను తీసుకొచ్చింది. వీటితో పాటు అదనంగా రూ.100 చెల్లిస్తే.. ఆరు ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్స్‌, రూ.200 చెల్లిస్తే అదనంగా 14 ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్స్‌ను అందజేస్తుంది.

రూ.599 చెల్లించడం ద్వారా.. అన్‌ లిమిటెడ్‌ ఇంటర్నెట్‌ (30 ఎంబీపీఎస్‌) స్పీడ్‌, 14 ఓటీటీ ఆప్స్‌ అందుబాటులో ఉంటాయి. మూడు నెలలకోసారి కాకుండా ప్రతీ నెల పోస్ట్ పెయిడ్‌ బిల్లును చెల్లించే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఫిక్స్‌డ్‌ లైన్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సేవల విభాగంలో కొత్త కస్టమర్లను ఆకర్శించడంలో జియో ముందు ఉన్నది. కస్టమర్‌ల సంఖ్యాపరంగా దాదాపు దశాబ్దాలుగా అగ్ర స్థానంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ను వెనక్కి నెట్టి.. గత నవంబర్‌ నెలలో జియో మొదటి స్థానానికి చేరుకున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement