Thursday, April 18, 2024

జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల

కరోనా కారణంగా మూడో విడ‌త జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆయా పరీక్షలను ఈనెల 20, 25 తేదీల్లో జరపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు మూడో విడత జేఈఈ మెయిన్స్ అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ -ఎన్‌టీఏ విడుదల చేసింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా త‌మ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చ‌ని ప్ర‌క‌టించింది.

కాగా మూడో విడత జేఈఈ మెయిన్స్‌లో ఇంజినీరింగ్‌ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరవుతారు. నాలుగో విడుత జేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఈ పరీక్షను జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు ఇంజినీరింగ్‌తో పాటు ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో ఇకపై జాబ్ క్యాలెండర్

Advertisement

తాజా వార్తలు

Advertisement