Thursday, April 25, 2024

ఆగస్టులో జేఈఈ మెయిన్స్‌.. సెప్టెంబర్‌లో నీట్‌

ఇంజినీరింగ్‌, మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షల తేదీలపై త్వరలో క్లారిటీ రానుంది. జేఈఈ మెయిన్స్‌ ఇప్పటికే రెండు సెషన్లు ముగియగా, మిగిలిన రెండు దశలను జూలై, ఆగస్టులో నిర్వహించాలని, నీట్‌ పరీక్షను సెప్టెంబర్‌లో నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ భావిస్తున్నది. కరోనా నేపథ్యంలో జేఈఈని జూన్‌ చివరి వారం లేదా ఆగస్టులో నిర్వహిస్తామని, నీట్‌ సెప్టెంబర్‌కు వాయిదా పడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు సమాచారం అందించాయి. అదేవిధంగా ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షపై కూడా త్వరలోనే స్పష్టత రానుంది.

విద్యార్థులు తమ స్కోర్‌ మెరుగుపరుచుకోవడానికి, మరింత మందికి అవకాశం కల్పించడానికి జేఈఈ మెయిన్స్‌ పరీక్షను ఈ ఏడాది నుంచి నాలుగు సెషన్లుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి సెషన్లు ముగిసాయి. ఇక ఏప్రిల్‌, మే సెషన్లు కరోనాతో వాయిదాపడుతూ వస్తున్నాయి. అయితే రాష్ట్రాల్లో కరోనా కేసులు నేపథ్యంలో ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై సందిగ్ధత ఏర్పడింది. వీటితోపాటు జూలై 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను కూడా వాయిదా వేశారు. ఇక నీట్‌ యూజీ పరీక్షను సెప్టెంబర్‌ నెలలో నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement