Wednesday, April 17, 2024

జులై 3న జేఈఈ అడ్వన్స్‌డ్‌ పరీక్ష.. 18న రిజ‌ల్ట్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుంది. జులై 18న ఫరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. జులై 21న ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు నిర్వహిం చనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 8 నుంచి 15 వరకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.

జులై 3న ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష పేపర్‌-1ను ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుంది. ఏప్రిల్‌, మే నెలల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement