Saturday, April 20, 2024

నా కొడకల్లారా మీకు పనులు చెయ్యాలా !! జేసీ సంచలన వ్యాఖ్యలు

జెసి బ్రదర్స్ ఎప్పుడూ… ఏదో ఒక సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్ చేశారు. నేను ఎవరికీ జవాబు చెప్పను. నన్ను పనులు చేయమని అడిగే హక్కు ఒక్క నా కొడుక్కి లేదని ఆయన అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ కాలనీ లో పర్యటించిన సమయంలో ప్రజలకు తో మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అక్కడి వారు మాకు రోడ్డు వేయాలంటూ కోరారు. వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు పనులు అడుగుతారా !! నా కొడకల్లారా మీకు అలా అడిగే హక్కు లేదు. మీరు డబ్బు తీసుకోకుండా ఓటు వేసి ఉంటే నేను మీకు పనులు చేయాలి అంటూ ప్రజలను ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

నీతి నిజాయితీగా ఓటు వేసినప్పుడే నిలదీసే హక్కు ఉంటుందని ఆయన అన్నారు. డబ్బులకు ఓటు అమ్ముకుంటే నాయకులకు నిలదీసే హక్కు లేదని ఆ హక్కును కోల్పోతామని ఆయన అన్నారు. డబ్బు తీసుకోకుండా ఓటు వేసిన రోజు నాయకుడి కాలర్ పట్టుకుని మా పనులు చేయమని అడిగే హక్కు ఉంటుందని చెప్పుకొచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement