Thursday, April 18, 2024

స‌హ‌చ‌రుల‌పై జ‌వాన్ కాల్పులు.. ఇద్ద‌రు మృతి..

గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో అనుకోని ఘటన చోటుచేసుకున్నది. గుజారాత్ ఎన్నిక‌ల బందోబ‌స్తులో భాగంగా విధుల‌కు వ‌చ్చిన ఓ జ‌వాన్ స‌హ‌చ‌ర జ‌వాన్ల‌పై కాల్పుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ దాడిలో ఇద్ద‌రు జ‌వాన్లు మృతి చెంద‌గా.. మ‌రో ఇద్దిరికి తీవ్ర గాయాల‌య్యాయి. పోర్ బందర్ సమీపంలోని తుక్డా గోసా గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం బస్సులో ప్రయాణిస్తుండగా వారిమధ్య గొడవ తలెత్తింది. మాటామాట పెర‌గ‌డంతో కోపోద్రిక్తుడైన తోటి జ‌వాన్‌ ఎస్‌.ఇనౌచాసింగ్‌.. తన తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు తోయిబా సింగ్, జితేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చోరాజిత్, రోహికానా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వీరిని జామ్ నగర్ లోని ఆసుపత్రికి తరలించినట్లు పోర్ బందర్ కలెక్టర్ ఏఎం శర్మ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement