Friday, April 19, 2024

Japan Tour – బుల్లెట్ ట్రైన్ లో తమిళనాడు సిఎం స్టాలిన్

టోక్యో – జపాన్‌ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ బుల్లెట్‌ ట్రయిన్‌లో ప్రయాణించారు. ఏకంగా 500 కిలోమీటర్లు బుల్లెట్‌ ట్రయిన్‌లో ప్రయాణించారు. విదేశీ పెట్టుబడుల కోసం స్టాలిన్‌ జపాన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జపాన్‌ పర్యటనలో భాగంగా బుల్లెట్‌ ట్రయిన్‌ ఎక్కారు. ఓసాకా నగరం నుంచి జపాన్‌ రాజధాని టోక్యో వరకు బుల్లెట్‌ రైల్‌లోనే ప్రయాణించారు. బుల్లెట్‌ రైల్‌లోని ఫోటోలను సీఎం స్టాలిన్‌ తను స్వయంగా ట్వీట్టర్‌లో షేర్‌ చేశారు. వేగవంతమైన ఇలాంటి బుల్లెట్‌ రైల్‌ సర్వీసులు భారతీయ పౌరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఒసాకా నుంచి టోక్యో వరకు బుల్లెట్‌ రైల్‌లో ప్రయాణం చేశానని.. దాదాపు రెండున్నర గంటల లోపే 500 కిలోమీటర్ల ప్రయాణం సాగిందని స్టాలిన్‌ ట్వీట్టర్‌లో పేర్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement