Tuesday, April 23, 2024

రైలు కింద ప‌డి ఒలింపిక్స్ అధికారి ఆత్మ‌హ‌త్య‌

మ‌రికొద్ది రోజుల్లో ఒలింపిక్స్ ఆతిథ్య‌మివ్వ‌బోతున్న జ‌పాన్‌లో విషాదం చోటు చేసుకుంది. జ‌ప‌నీస్ ఒలింపిక్ క‌మిటీ (జేఓసీ)కి చెందిన ఓ అధికారి సోమ‌వారం ఉద‌యం రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు టోక్యో మెట్రోపాలిట‌న్ పోలీస్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. య‌సుశి మోరియా అనే 52 ఏళ్ల ఆ అధికారి ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌న్న విష‌యం తెలియ‌లేదు. దీనిపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇది ఆత్మ‌హ‌త్య‌లాగే క‌నిపిస్తోంద‌ని మాత్రం వాళ్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement