Wednesday, April 24, 2024

జపాన్ లో ఫ్యాన్స్ తో సందడి చేస్తోన్న.. రామ్ చరణ్ దంపతులు

ఫ్యాన్స్ తో సందడి చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు..ఈ మేరకు జపాన్ లోని ఓ రెస్టారెంట్ లో ప్రత్యక్షమయ్యారు. తమ అభిమానులతో కలసి విందు స్వీకరించారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా శుక్రవారం జపాన్ లో విడుదల కానుంది. ఈ కార్యక్రమం కోసం రామ్ చరణ్ తన భార్యతో కలసి మంగళవారం జపాన్ వెళ్లారు. జపాన్ పర్యటన విశేషాల ఫొటోలను ఉపాసన తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. జపనీస్ అభిమానులతో వీరు రెస్టారెంట్ లో విందు పార్టీ చేసుకున్నారు. ఫ్యాన్స్ అందరూ నవ్వులు చిందిస్తున్న ఫొటోను ఉపాసన పోస్ట్ చేసింది. జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి తదితరులు పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement