Saturday, April 20, 2024

కొత్తగా పార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తాం: పవన్

మరికాసేపట్లో తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం షర్మిల తన పార్టీపై ప్రకటన చేయనున్నారు. ఈ సందర్భంగా షర్మిల పార్టీపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. కొత్తపార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తామని ఆయన అన్నారు. కొత్తపార్టీలు రావాలని, ఆ పార్టీలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ఆకాంక్షించారు.

మరోవైపు తెలంగాణలో జనసేన పార్టీ ఎలా ఉండబోతోందన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా.. జనసేన ఇవాళ కొత్తగా వచ్చిందికాదన్నారు. 2007 నుంచి తాను రాజకీయంలో ఉన్నానని తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నేలని, ఇలాంటి నేలలో కొత్త రక్తం, చైతన్యంతో కూడుకున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. అలాంటి వారిని జనసేన గుర్తించి ప్రోత్సాహం ఇస్తుందన్నారు. పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైందన్నారు. తను పగటి కలలు కనే వ్యక్తిని, కుటుంబ వారసత్వ రాజకీయం ఉన్నవాళ్లే కాకుండా ఇతరులు కూడా రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

ఈ వార్త కూడా చదవండి: షర్మిల పార్టీకి కాంగ్రెస్ ఎంపీ మద్దతు

Advertisement

తాజా వార్తలు

Advertisement