Friday, March 29, 2024

RRR విషయంలో లోక్‌సభ స్పీకర్ జోక్యం చేసుకోవాలి: నాదెండ్ల

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. జగన్ ప్రభుత్వ తీరుపై లోక్‌సభ స్పీకర్ సుమోటోగా విచారణకు ఆదేశించాలన్నారు. ఎంపీగా రఘురామకు ఉండే హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాసినట్లు తెలుస్తోందన్నారు. విచారణ పేరుతో ఎంపీ పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదన్న ఆయన.. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటున్న ఎంపీ పట్ల విచారణ పేరుతో పోలీసులు అనుచితంగా వ్యవహరించకూడదని చట్టం చెబుతోందని, నిబంధనలకు లోబడి దర్యాప్తు ప్రక్రియ కొనసాగించాలని నాదెండ్ల మనోహర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement