Friday, April 19, 2024

రోడ్డు ప్ర‌మాదంలో డ‌బ్బింగ్ చిత్రాల నిర్మాత మృతి ..

టాలీవుడ్ ఇప్ప‌టికే ప‌లువురు సెల‌బ్రిటీల మ‌ర‌ణాల‌తో శోక‌సంద్రంలో ఉంది..కాగా రోడ్డు ప్ర‌మాదంలో డ‌బ్బింగ్ సినిమాల నిర్మాత జ‌క్కుల నాగేశ్వ‌రరావు మ‌ర‌ణించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడిక్కడే మరణించారు. ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో మరోసారి విషాదం అలముకుంది. జక్కుల నాగేశ్వరరావు లవ్ జర్నీ, వీడు సరైనోడు, అమ్మా నాన్నా ఊరెళితే వంటి చిత్రాలను తెలుగులో విడుదల చేశారు. కాగా ఆయ‌న వ‌య‌సు 46ఏళ్ళు .. నిర్మాత నాగేశ్వరరావుకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement