Thursday, April 25, 2024

భార‌త జ‌ట్టులోకి జైశ్వాల్‌.. గైక్వాడ్ పెళ్లితో ల‌క్కీ చాన్స్‌

జూన్ ఏడు నుంచి లండ‌న్ లో జ‌రిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత స్టాండ్‌బై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు. అతను జూన్ 3-4 తేదీలలో వివాహం చేసుకోబోతున్నాడు. జూన్ 5 లోపు లండన్‌లో ఉన్న ఇండియ‌న్ జట్టులో చేరలేదు. గైక్వాడ్‌ను మొదట్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) WTC ఫైనల్‌కు బ్యాకప్ ఓపెనర్‌గా లింక్ చేసింది.

ఇప్పుడు పరిస్థితి మారడంతో, భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెంటనే అత‌ని ప్లేసులో మ‌రొక‌రిని ఎంపిక చేయాల‌ని బిసిసిఐని కోరాడు. దీంతో ఐపీఎల్ లీగ్ లో అద్బుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన‌ యువ ఆట‌గాడు యశస్వి జైస్వాల్ ని జట్టులో చేర్చిన‌ట్టు తెలుస్తోంది. త్వరలోనే అతను లండ‌న్ లో ఉన్న భార‌త‌ జట్టులో చేరబోతున్నట్టు స‌మాచారం.

ఇక‌ ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ మే 28న లండన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఆదివారం ఐపీఎల్ ఫైనల్‌లో ఆడనున్న సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ షమీ, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా మే 30న బయలుదేరే అవకాశం ఉంది. ఇప్పటికే భారత జట్టు సభ్యుల జట్టు లండన్‌లో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement