Wednesday, April 24, 2024

ఉచిత విద్యుత్ ఎత్తివేసేందుకు జ‌గ‌న్ కుట్ర : నారా లోకేష్‌

నిరుపేద గిరిజనులు, దళితులకు 200 యూనిట్లలోపు వాడుకుంటే.. ఇస్తున్న ఉచిత విద్యుత్ ఎత్తేసేందుకు ఆరు దశల పరిశీలన పేరుతో కొత్త ఎత్తుగడ వేయడం జగన్ రెడ్డి బాదుడే బాదుడు పరిపాలనకి నిదర్శనమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ఒక్క అల్లూరి జిల్లాలోనే 20 వేలకి పైగా గిరిజన కుటుంబాలకు వైసీపీ సర్కారు ఉచిత విద్యుత్ లేకుండా చేసిందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది గిరిజనుల ఇళ్లల్లో చీకట్లు నింపుతోందన్నారు. ఉచిత విద్యుత్ ఎత్తేయడమే దగా అయితే… పాతబకాయిల పేరుతో వేధించడం దారుణమని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement