Tuesday, April 16, 2024

Breaking : జగన్ అంటేనే ఒక బ్రాండ్ : మంత్రి రోజా

కేవలం జగన్ పై ఉన్న నమ్మకంతోనే రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, జగన్ అంటేనే ఒక బ్రాండ్.. జగన్ అంటేనే ఒక జోష్ అని ఏపీ పర్యాటక మంత్రి రోజా కొనియాడారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం సంతోషంగా ఉందన్నారు. పర్యాటక రంగంలోనే రూ.22 వేల కోట్ల పెట్టుబడులు రావ‌డం ఇదే తొలిసారన్నారు. గత ప్రభుత్వం మాదిరి నామమాత్రపు ఒప్పందాలు కాదని… ప్రతి ఒప్పందాన్ని క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్తామని తెలిపారు. తిరుపతిని టెంపుల్ టూరిజంగా, విశాఖను ప్రకృతి టూరిజంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని రోజా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement