Thursday, April 25, 2024

లిక్కర్, అక్రమ ఇసుక మైనింగ్ కు జగన్ బ్రాండ్ అంబాసిడర్ : కన్నా లక్ష్మీనారాయణ

జ‌గ‌న్ రాక్ష‌స పాల‌న చూసి కూడా పెట్టుబ‌డులు ఎలా వ‌స్తాయ‌ని, లిక్కర్, అక్రమ ఇసుక మైనింగ్ కు జ‌గ‌న్ బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. జగన్ కు ఎన్నికల సంవత్సరం పెట్టుబడుల అంశం గుర్తుకు రావడం ఆశ్చర్యం గా ఉందని.. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తె సంతోషమేనని వివరించారు. ఇప్పటం ప్రజల మీద కక్ష సాధింపు జరుగుతుంది. ఈ ప్రభుత్వం కూలగొట్టడాల తోనే ప్రారంభం అయ్యిందని ఫైర్‌ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క కట్టడం ఎక్కడైనా కట్టారేమూ సమాధానం చెప్పాల‌న్నారు. రాష్ట్రంలో అవినీతి పాల‌న కొన‌సాగుతుంద‌న్నారు. పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇవ్వడం ఇప్పటం ప్రజలు చేసిన తప్పా అన్నారు. టిడిపి, జనసేన కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని.. నేను పులిని అని చెప్పుకునే జగన్ కు ప్రతిపక్షాల పొత్తులు పై ఎందుకు భయం అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement