వినుకొండ – జగనన్న చేదోడు పథకంలో భాగంగా మూడో విడత సాయం నిధుల విడుదల కార్యక్రమం కోసం వినుకొండలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తున్నారు.. దీనిలో భాగంగా జగనన్న చేదోడు పథకం కింద.. దర్జీలు, రజకులు, నాయీబ్రహ్మణుల ఒక్కొకరికి రూ.10 వేల చొప్పున వారి ఖాతాలలోజగన్ వేయనున్నారు..
ఈ పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి రూ.330. 15 కోట్ల రూపాయలతో లబ్ధి చేకూరనుంది. ఇదిలా ఉంటే.. ఈ మూడేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద రూ.927.51 కోట్లు సాయం అందజేసింది జగన్ ప్రభుత్వం. వినుకొండలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష్య ప్రసారంగా తిలకించగలరు.