Wednesday, April 17, 2024

ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానీకం టీజ‌ర్ రిలీజ్-న‌రేష్ కి మ‌రో హిట్ట్ ప‌డేనా

హీరో అల్ల‌రి న‌రేష్ నటిస్తోన్న తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం . ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో నరేష్ ఎలక్షన్ అధికారిగా అద్భుతమైన నటనతో అదరగొట్టాడు. కాగా సినిమాలో వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.మ‌రి ఈ చిత్రం న‌రేష్ కి ఏ మేర‌కు విజ‌యాన్ని అందించ‌నుందో చూడాలి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement