Thursday, April 18, 2024

విశాఖలో ఆరుగురి హత్య వెనుక ప్రేమకథ – రొమాంటిక్ క్రైమ్ స్టోరీ

విశాఖ జిల్లా పెందుర్తిలో పాత కక్షల నేపథ్యంలో పసి పిల్లలతో సహా ఆరుగురిని నరికి చంపిన నర హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడిని ఉరి తీయాలంటూ బంధువుల ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు బంధువులను సర్దిచెప్పి ఆందోళనను శాంతిపరిచారు. అసలు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హంతకుడు బత్తిన అప్పలరాజు కూతురు పార్వతి, బమ్మిడి విజయ్ కుమార్ ఒకరికొకరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి బొమ్మిడి విజయ్ కుమార్ మోసం చేయడంతో.. 2018లో విజయ్ కుమార్‌పై పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే బొమ్మడి విజయ్ కుమార్ విజయవాడకు చెందిన ఉషారాణిని పెళ్లి చేసుకుని విజయవాడ వెళ్ళిపోయాడు.

బొమ్మిడి విజయ్ కుమార్, ఉషారాణి దంపతులకు ముగ్గురు పిల్లలు. జుత్తాడ గ్రామంలో బొమ్మిడి విజయ్ కుమార్ తండ్రి బొమ్మిడి రమణ ఒక్కడే నివాసముంటున్నారు. ఎంపీటీసీ ఎన్నికల ఓటు వేయడానికి విజయ్ కుమార్ భార్య ఉషారాణి, అత్తగారు, చిన్నత్త గారు జుత్తాడ గ్రామానికి వచ్చి బంధువుల వివాహం ఉండడంతో గ్రామంలో ఉండిపోయారు. బమ్మిడి విజయ్ కుమార్ తన పెద్ద కుమారుడిని తీసుకుని శివాజీ పాలెంలో ఉండిపోయాడు.

గురువారం తెల్లవారుజామున చిన్నత్త బయటికి వచ్చి వాకిలి కడుగు తుండగా బత్తిని అప్పలరాజు ఆమెపై కత్తితో దాడి చేసి చంపి ఇంట్లో ప్రవేశించి విచక్షణారహితంగా ఇద్దరు చిన్న పిల్లలను, విజయ్ కుమార్ భార్య, అత్త, తండ్రిని కత్తితో నరికి చంపేశాడు.

ఇంటి నుండి బయటకు వచ్చి అరుగుపైన అరగంట సేపు కూర్చొన్నాడు. అనంతరం స్థానికులు 100కి కాల్ చేయడంతో పెందుర్తి పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. అయితే ఘటనా స్థలానికి వచ్చిన పోలీస్ కమిషనర్‌ను గ్రామస్తులు అడ్డగించి హంతకుడిని ఇక్కడే ఉరి తీయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనితో పెద్దఎత్తున పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement