Thursday, March 28, 2024

Cricket | ఇండియాపై టెస్టు సిరీస్ గెల‌వ‌డం క‌ష్ట‌మే.. యాషెస్ కంటే విలువైంద‌న్న స్మిత్

బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు స్టీవ్ స్మిత్ సంచ‌ల‌న కామెంట్స్​ చేశాడు. టీమిండియాపై టెస్టు సిరీస్ గెల‌వ‌డం త‌మ‌కు ఎంతో ఇంపార్టెంట్​ అని, యాషెస్ సిరీస్​ని గెలవ‌డం కంటే ఇదే ఎక్కువ అని స్మిత్ అన్నాడు. భార‌త ప‌ర్య‌ట‌న గురించి ఆసీస్ క్రికెట‌ర్లు అభిప్రాయాలు పంచుకున్న వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఆ వీడియోలో.. భార‌త గ‌డ్డ‌పై సిరీస్‌లో ఒక్క‌ టెస్టు గెల‌వ‌డం కూడా క‌ష్ట‌మే. అలాంటిది మేము సిరీస్ నెగ్గితే అది పెద్ద విజ‌యం. భార‌త్‌లో సిరీస్ గెలవ‌డం అనేది యాషెస్ కంటే విలువైన‌ది అని స్మిత్ ఆ వీడియోలో తెలిపాడు.

బిగ్‌బాష్ లీగ్‌లో సెంచ‌రీలు..

బోర్డ‌ర్ – గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్, భార‌త్ నాలుగు టెస్టులు ఆడ‌నున్నాయి. తొలి టెస్టుకు నాగ్‌పూర్ వేదిక. ఫిబ్ర‌వ‌రి 9న తొలి స‌మ‌రం మొద‌లుకానుంది. ఈమ‌ధ్యే బిగ్‌బాష్ లీగ్‌లో వ‌రుసగా రెండు సెంచ‌రీలు బాదిన స్మిత్ ఈ సిరీస్‌లో రాణించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. నెట్ ప్రాక్టీస్‌లో ఆసీస్ భార‌త స్పిన్న‌ర్ అశ్విన్‌ను ఎదుర్కొనేందుకు బ‌రోడా స్పిన్న‌ర్ మ‌హేశ్ పిథియాను తీసుకుంది. అత‌ని బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ ప్రాక్టీస్ చేస్తూ వీడియోలో క‌నిపించాడు. స్వ‌దేశంలో బాక్సింగ్ డే టెస్టులో దుమ్మురేపిన వార్న‌ర్ కూడా ఇండియాపై ప‌రుగుల వ‌ద‌ర పారించేందుకు ఎదురుచూస్తున్నాడు. దాంతో, ఇరుజ‌ట్ల మ‌ధ్య ఈ సీర‌స్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా, ఉత్కంఠ‌భ‌రితంగా ఉండ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement